Araku Parliament Elections 2024: అరకు పార్లమెంట్లో సీనియర్, జూనియర్ మధ్య పోటీ నెలకొంది. టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా కొత్తపల్లి గీత బరిలో ఉండగా.. అధికార వైసీపీ నుంచి శెట్టి తనూజ రాణి పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఒకసారి అరకు ఎంపీగా చేసిన కొత్తపల్లి గీత..
Araku Parliament Elections 2024: అరకు పార్లమెంట్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. సీనియర్ Vs జూనియర్ మధ్య పోరు నెలకొంది. ఒకరు కేంద్ర ప్రభుత్వ బలంపై నమ్మకం పెట్టుకోగా.. మరోకరు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమంతో గెలుపుపై ధీమాతో ఉన్నారు. మరి ఇద్దరిలో గెలుచేదెవరు..? లోక్సభలో అడుగుపెట్టేదెవరు..?ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారం రంగంలో దూసుకుపోతున్నారు. ఓటర్లను నిత్యం కలుస్తూ.. తమకే ఓటు వేయాలంటూ కోరుతున్నారు. గెలుపు తమదంటే తమదంటూ లెక్కలు వేసుకుంటున్నారు.
అరకు పార్లమెంట్లో సీనియర్, జూనియర్ మధ్య పోటీ నెలకొంది. టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా కొత్తపల్లి గీత బరిలో ఉండగా.. అధికార వైసీపీ నుంచి శెట్టి తనూజ రాణి పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఒకసారి అరకు ఎంపీగా చేసిన కొత్తపల్లి గీత.. రెండోసారి అరకు పార్లమెంట్ బరిలోకి దిగుతున్నారు. వైసీపీ కొత్త అభ్యర్థిని పోటీకి నిలబెట్టింది. అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ కోడలు, డాక్టర్ శెట్టి తనుజా రాణి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు.
బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత.. ఈసారి కూటమి అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు. గిరిజన గ్రామాలను తాను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి ఎంతో అభివృద్ధి చేశానని.. మరోసారి తనకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. గిరిజనులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ.. ఓటర్లతో మమేకం అవుతున్నారు. తాను ఎంపీగా గెలిస్తే.. అరకు రూపురేఖలు మారుస్తానంటూ హామీలు ఇస్తున్నారు.
సిట్టింగ్ ఎంపీ గొట్టేటి మాధవి స్థానంలో ముందుగా భాగ్యలక్ష్మికి ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. ఆమెకు టికెట్ ఖాయమనుకోగా.. చివరి నిమిషంలో తనూజ రాణి పేరు తెరపైకి వచ్చింది. అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ కోడలు కావడం.. వైద్యురాలుగా స్థానికంగా పేరు ఉండడంతో ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనకు విజయాన్ని అందిస్తాయని వైసీపీ అభ్యర్థి శెట్టి తనూజ రాణి ధీమాతో ఉన్నారు.
ఒకవైపు రాజకీయాల్లో సీనియర్గా ఉన్నకొత్తపల్లి గీత.. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తనూజ రాణి మధ్య పోరు హోరాహోరీగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. టీడీపీ, జనసేన ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ కావడంపై కొత్తపల్లి గీత విజయ అవకాశాలు ఆధారపడి ఉండగా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలపైనే తనూజ రాణి నమ్మకం పెట్టుకున్నారు. సీనియర్ Vs జూనియర్ మధ్య పోరులో అరకు ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచిచూడాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ ..
Kothapalli Geetha Setty Tanuja Rani BJP Ysrcp
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Lok Sabha Election 2024: Congress Bowls Googly To Manoj Tiwari, Fields Kanhaiya Kumar From North East DelhiThe Congress party on Sunday released a list of ten candidates for the upcoming Lok Sabha Elections 2024 and fielded Kanhaiya Kumar from North-East Delhi Lok Sabha seat.
और पढो »
Lok Sabha Election 2024: कॉमन मिनिमम एजेंडा तक नहीं दे पाया INDIA गठबंधन, समझौते के बावजूद क्षेत्रीय दलों ने झटका कांग्रेस का ‘हाथ’?Lok Sabha Elections 2024: लोकसभा चुनाव 2024 को लेकर बीजेपी का मेनिफेस्टो कल घोषित होगा। हफ्ते भर पहले कांग्रेस पार्टी भी अपना न्याय पत्र जारी कर चुकी है।
और पढो »
लोकसभा चुनाव-2024: तेजस्वी बोले- भाजपा के पास ED, CBI और धन-बल, लेवल प्लेइंग फील्ड हो तो इनकी 100 सीटें आना...Lok Sabha Election 2024 Live Updates; Follow MP Rajasthan UP Bihar Maharashtra Delhi Lok Sabha Chunav Latest News, Photos, Videos And Reports On Dainik Bhaskar.
और पढो »
Lok Sabha Election 2024: Bihar में गरजे CM Yogi Adityanath, कहा- माफियाओं का राम नाम सत्य…Lok Sabha Election 2024: Bihar में गरजे CM Yogi Adityanath, कहा- माफियाओं का राम नाम सत्य...
और पढो »
Dilip Ghosh: মুখ্যমন্ত্রীও নাচছে এখানকার প্রার্থীও নাচছে, ভোট আবহে ফের বেলাগাম দিলীপLok sabha election 2024 dilip ghosh attack mamata banerjee for vote campaign
और पढो »
RJD Manifesto Released: आरजेडी का घोषणा पत्र जारी, Tejashwi Yadav ने किए बड़े ऐलानLok Sabha Election 2024: राष्ट्रीय जनता दल का घोषणापत्र जारी
और पढो »