తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్ధం వైకుంఠ ద్వార దర్శనం, సర్వ దర్శనం టోకెన్ల జారీ షెడ్యూల్ ప్రకటించింది. జనవరి వరకూ జరిగే దర్శనాల వివరాలు తెలియజేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్ధం కీలక ప్రకటన చేసింది. వైకుంఠ ద్వార దర్శనం, సర్వ దర్శనం టోకెన్ల జారీపై ప్రకటన విడుదల చేసింది. ఏవి ఎప్పుడు జారీ చేస్తారో షెడ్యూల్ ఇలా ఉంది. జనవరి వరకూ జరిగే కార్యక్రమాల వివరాలు అందించింది. భక్తుల సౌకర్యార్ధం ఎప్పటికప్పుడు ప్రకటన జారీ చేస్తోంది. తిరుమలలో జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఉచిత టోకెన్లు జారీ చేయనున్నారు. జనవరి 10,11,12 తేదీల్లో దాదాపు 1.20 లక్షల సర్వ దర్శనం టోకెన్లు జారీ కానున్నాయి.
మూడ్రోజుల తరువాత మాత్రం ఎప్పటికప్పుడు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు ఈ పదిరోజుల్లో అంటే జనవరి 9 నుంచి 20 వరకూ శ్రీవారి దర్శనం ఉండదు. భక్తుల సౌకర్యార్ధం తిరుపతిలోని రామచంద్రపురం పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హైస్కూల్, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణునివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూల్, ఎంఆర్ పల్లి స్కూల్ , తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్తో కలిపి మొత్తం 91 కౌంటర్లలో టోకెన్లు జారీ చేస్తారు. సర్వ దర్శనం టోకెన్లు కావల్సిన భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందవచ్చని టీటీడీ ఈవో స్పష్టం చేశారు. కౌంటర్ల వద్ద ప్రత్యేకంగా క్యూ లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేయనున్నారు. క్యూ లైన్లలో నిరీక్షించే భక్తులకు తాగునీరు, మురుగుదొడ్డి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. జనవరి 10 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమౌతాయి. గోవింద మాల భక్తులకు ప్రత్యేక టికెట్లు ఉండవని టీటీడీ వెల్లడించింది
TIRUMALA TIRUPATHI DEVASTHANAM VAIKUNTHADWARA DARSANAM TOKENS SCHEDULE BHARATHI
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం.. మార్గదర్శకాలలో ఊహించని బిగ్ ట్విస్ట్ ఇచ్చిన టీటీడీ..Tirupati News: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం భాగ్యం కల్పిచేందుకు టీటీడీ కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా, తిరుమల తిరుపతి దేవస్థానం మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో స్థానికులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది.
और पढो »
TTD Guidelines: టీటీడీ కొత్త మార్గదర్శకాలు జారీ, ఎల్లుండి నుంచి స్థానికులకు ప్రత్యేక దర్శనంTirumala Tirupati Devasthanam issue new guidelines local people will have special Darshan TTD Guidelines: తిరుపతి స్థానిక నివాసితులకు శ్రీవారి దర్శనం కోసం టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానిక భక్తులకు స్వామి దర్శనం లభించనుంది.
और पढो »
తిరుమల శ్రీవారి దర్శనం కోసం టిటిడీ డిజిటల్ సాంకేతికతను పరికల్పిస్తుందితిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడీ) భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనాన్ని గంట సేపట్లో కల్పించేందుకు డిజిటల్ యాత్ర తరహాలో AI సాయాన్ని ఉపయోగించనుంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రోజుల తరబడి వేచి ఉండే పరిస్థితి త్వరలో ముగురనుంది.
और पढो »
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. నేటి నుంచి ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఇలా పొందండి..!Tirumala Special Darshan Tokens: తిరుమల శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రత్యేక దర్శనం టిక్కెట్లను జారీ చేయనుంది.
और पढो »
తిరుమల-తిరుపతి: పవిత్రక్షేత్రం సమీపంలో పబ్బు నిర్వహణ ఆగ్రహంతిరుమల-తిరుపతి పవిత్రక్షేత్రం సమీపంలో పబ్బు నిర్వహణ పెద్ద ఎత్తున ఆగ్రహానికి గురిచేస్తోంది. స్థానికులు, నెటిజన్లు, భక్తులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
और पढो »
Tirumala: వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్తున్నారా? టిక్కెట్లు, జారీ చేసే కౌంటర్లు ఇవే..Tirumala Vaikunta Ekadashi 2025 Tokens: తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్లు ప్రత్యేకంగా టీటీడీ యంత్రాంగం విడుదల చేయనుంది. అవి ఎప్పుడు? ఎక్కడ? ఇస్తారు పూర్తి వివరాలు మీకోసం.
और पढो »