తిరుమల-తిరుపతి పవిత్రక్షేత్రం సమీపంలో పబ్బు నిర్వహణ పెద్ద ఎత్తున ఆగ్రహానికి గురిచేస్తోంది. స్థానికులు, నెటిజన్లు, భక్తులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
తిరుమల-తిరుపతి : పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రం సమీపంలో పబ్ నిర్వహణ పెద్ద ఎత్తున ఆగ్రహానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఈ విషయం సంచలనంగా మారడమే కాకుండా ఈ విషయం తెలిసిన యావత్తు ప్రపంచ వెంకటేశ్వర స్వామి భక్తులు అసహనం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం పై మండిపడుతున్నట్లు సమాచారం. Profitable Small Business Idea: జీవితాంతం సాగే ఏకైక బిజినెస్.. తక్కువ పెట్టుబడితో నెలకు రూ.30 వేల లాభం.. డోంట్ మిస్ గురూ..: తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత పవిత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కలియుగ దేవుడిగా భక్తులకు దర్శనం ఇస్తున్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఒకవైపు అన్య మతస్తులు ప్రచారం చేస్తుండగా.. మరొకవైపు ఇలా పబ్బు పేరిట గబ్బు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పాశ్చాత్య సంస్కృతులకు అలవాటు పడిన యువత ఇప్పుడు పబ్ మోజులో పడి అసలు మనం ఏం చేస్తున్నాము అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా ప్రవర్తిస్తున్నారు. స్వామివారి సన్నిధిలో ఇలాంటి అపచారాలు కలియుగ అంతానికి సూచనగా నిలుస్తున్నాయని పలువురు పండితులు చెబుతున్నారు. ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ అయ్యిందనే ఆరోపణలు రావడంతోనే.. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఈయన ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటూ పలువురు నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నాడు జగన్ ప్రభుత్వంలో కల్తీ జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ దీక్ష పేరిట తిరుమల తిరుపతి దేవస్థానం మెట్లు శుభ్రం చేస్తూ కనిపించిన పవన్ కళ్యాణ్, నేడు జగన్ ప్రభుత్వం కాదులే మన ప్రభుత్వంలో తప్పులు జరగవని కళ్ళు మూసుకున్నారా లేక నిజంగానే గుడ్డివాడయ్యాడా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరలో ఉండే చంద్రగిరి ప్రాంగణంలో ఈ పబ్బు నిర్వహణ జరుగుతోందని, ఎటువంటి అనుమతులు లేకుండానే ఈ పబ్బు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు రాత్రి 7 నుంచి అర్ధరాత్రి 12 వరకు ఈ పబ్బు నిర్వహణ ఉంటుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే తిరుమల పవిత్రతను కోల్పోయే అవకాశం ఉందని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు
తిరుమల-తిరుపతి పబ్బు ఆగ్రహం భక్తులు ప్రభుత్వం పవిత్రత
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం.. మార్గదర్శకాలలో ఊహించని బిగ్ ట్విస్ట్ ఇచ్చిన టీటీడీ..Tirupati News: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం భాగ్యం కల్పిచేందుకు టీటీడీ కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా, తిరుమల తిరుపతి దేవస్థానం మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో స్థానికులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది.
और पढो »
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. నేటి నుంచి ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఇలా పొందండి..!Tirumala Special Darshan Tokens: తిరుమల శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రత్యేక దర్శనం టిక్కెట్లను జారీ చేయనుంది.
और पढो »
సీఎం చంద్రబాబు: 'ఫెంగల్' తుఫాన్ ముప్పు పొంచి ఉంటుందని విధ్వంసాన్ని స్మరించి, అప్రమత్తం వట్టనుఫెంగల్ తుఫాన్ వచ్చిన తోమరికి, సీఎం చంద్రబాబు తుఫాన్ వివరాలను తెలుసుకున్నారు. విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లు, ముఖ్యమంత్రి కార్యాలయం మరియు రియల్ టైం గవర్నెన్స్ అధికారులను అప్రమత్తం చేశారు.
और पढो »
AP Weather Forecast: బలహీనపడుతున్న తుపాను, రానున్న 3 రోజులు ఏపీలో భారీ వర్షాలుAndhra pradesh Weather Forecast Updates Heavy Rains Alert for coming 3 days పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిన ఫెంగల్ తుపాను ప్రస్తుతం తమిళనాడు-పుదుచ్చేరి మధ్య స్థిరంగా కొనసాగుతోంది
और पढो »
Tirumala: తిరుమలలో నెల రోజులపాటు సుప్రభాత సేవ రద్దు.. ఆ స్థానంలో తిరుప్పావై పారాయణ, ఎందుకో తెలుసా?Tirumala Suprabhata Seva: తిరుమల శ్రీ వేంకటేశుని ఆలయంలో ప్రతిరోజూ పారాయణ చేసే సుప్రభాత సేవను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆ స్థానంలో తిరుప్పావై పారాయణ చేయాలని టీటీడీ యంత్రాంగం నిర్ణయించింది.
और पढो »
Tirumala: భక్తులకు భారీ ఆఫర్ ప్రకటించిన టీటీడీ.. ఇలా చేస్తే సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం..Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల మంది భక్తులు క్యూ కాంప్లెక్స్లో ఎదురు చూస్తుంటారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి టికెట్లను మంజూరు చేస్తారు.
और पढो »