తెలంగాణ కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలు తిరుగులేని అంశంగా మారాయి. 11 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీతో ఆ పార్టీ వ్యతిచారం పెరిగింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు.
తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి 10 యేళ్ల తర్వాత అధికారం కట్టబెట్టారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ తప్పిదాలతో పాటు బీజేపీ చేసిన మిస్టేక్స్ కాంగ్రెస్ కు అయాచిత వరంగా మారాయి. దాన్ని రేవంత్ సరైన క్రమంలో పెట్టి ప్రజల్లో వెళ్లి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. తీరా ప్రభుత్వం ఏర్పడి యేడాది గడవక ముందే అపుడే కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలనే ముసలం పుట్టింది.ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ తో పాటు దేశాన్ని సుధీర్ఘ కాలం పాలించిన పార్టీగా కాంగ్రెస్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లోనే డైరెక్ట్ అధికారంలో ఉంది. అందులో తెలంగాణ ఒకటి. మరోవైపు తమిళనాడు, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్ వంటి రాష్ట్రాల్లో భాగస్వామ్య పక్షంగా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఓ నానుడి ఉంది. దాన్ని ఓడించడానికి ప్రతిపక్షాలు అవసరం లేదు. వాళ్ల పార్టీని ఆ పార్టీలోని మరో గ్రూపు ఓడిస్తుందనేది రాజకీయాల్లో తరుచు చెప్పే మాట. రాజశేఖర్ రెడ్డి సమయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇలాంటి గ్రూపు రాజకీయాలు లేకుండా సాగిపోయింది. అపుడు కూడా పి.జనార్ధన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి వంటి వాళ్లు కాంగ్రెస్ పార్టీలో వైయస్ వ్యతిరేక వర్గం ముద్ర పడ్డారు. తాజాగా 2023లో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాకా.. గ్రూపు రాజకీయాలు కొనసాగకుండా చేశారు. కానీ తీరా ఇపుడు మరోసారి కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాలు బట్ట బయలయ్యాయి. తాజాగా తెలంగాణలో 11మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ సంచలనంగా మారింది. అంతేకాదు అధికార పార్టీలో ఈ అంశం తీవ్ర దుమారం రేపుతోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఈ భేటీ వెనుక కీలకపాత్ర పోషించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల తీరుకు వ్యతిరేకంగానే ఈ సమావేశం జరిగినట్లు సమాచారం. ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఎమ్మెల్యేలు గుస్సాగా ఉన్నారని తెలుస్తోంది. అయితే 11 మంది ఎమ్మెల్యేల సమావేశం వెనుక ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి కోమటి రెడ్డి హస్తం ఉందన్న వార్తలు వస్తున్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సదరు మంత్రికి ముఖ్య అనుచరుడు కావడంతో అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించిన అనిరుధ్ రెడ్డి త్వరలోనే మీడియా ముందుకు వస్తారని తెలుస్తోంది.ఇక కాంగ్రెస్ పార్టీలో కొంత మంద ఎమ్మెల్యేల రమస్య భేటి నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ నేపథ్యంలో సీఎం హస్తిన పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. పదకొండు మంది ఎమ్మెల్యేల రహస్య భేటీపై అధిష్టానంతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలపైనా ఫోకస్ పెట్టనున్నారు. మరోవైపు ఢిల్లీ శాసన సభ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు
రాజకీయం తెలంగాణ కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు రేవంత్ రెడ్డి
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
తెలంగాణలో జనవరి 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులుతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.
और पढो »
Abhaya Hastham Scheme: తెలంగాణ చేనేత అభయహస్తం పథకం.. A to Z వివరాలు ఇవేAbhaya Hastham Scheme Guidelines: తెలంగాణ చేనేత అభయహస్తం పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నేడు జీవో జారీ చేసింది.
और पढो »
పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు ఆన్లైన్ విధానంతెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి సీతక్క ఆన్లైన్ విధానం ద్వారా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు.
और पढो »
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్: పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యాఖ్యలుగేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం, జగన్, రేవంత్ రెడ్డిపై విమర్శలు సంధించారు.
और पढो »
కిషన్ రెడ్డి: రైతు భరోసాకు దరఖాస్తు పేరుతో మరో మోసం!కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతు భరోసాకు దరఖాస్తులు ఆహ్వానించడంపై విమర్శలు కాశించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు.
और पढो »
ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోందిఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రత తగ్గుతోంది. వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
और पढो »